GST: దుమ్మురేపుతున్న జీఎస్టీ వసూళ్లు.. లక్ష కోట్లు దాటేసిన వైనం

GST Crosses One Lakh crores in February

  • ఫిబ్రవరిలో రూ.1,05,366 కోట్లు వసూలు
  • జనవరితో వసూలైన వాటితో పోలిస్తే తక్కువే
  • గతేడాదితో పోలిస్తే 8.3 శాతం అధికం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ ప్రభుత్వ ఖజానాను నింపుతున్నాయి. ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఈ స్థాయిలో వసూలు కావడం ఇది వరుసగా నాలుగోసారి. ఫిబ్రవరిలో జీఎస్టీ కింద రూ.1,05,366 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలతో  పోలిస్తే ఇది 8.3 శాతం అధికం కాగా, జనవరితో పోలిస్తే మాత్రం తక్కువ. ఆ నెలలో ఏకంగా రూ.1.10 లక్షల కోట్లు వసూలైంది. ఫిబ్రవరిలో వసూలైన రూ.1,05,366 కోట్లలో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,569 కోట్లు కాగా,  ఎస్‌జీఎస్టీ కింద రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.48,503 కోట్లు వసూలయ్యాయి. సెస్‌ల రూపంలో  8,947 కోట్లు వసూలైంది.

  • Loading...

More Telugu News