Adilabad District: 'ప్లీజ్‌ సర్‌.. వెళ్లొద్దు.. ఇక్కడే ఉండండి ప్లీజ్‌' అంటూ కన్నీరుమున్నీరైన విద్యార్థులు

  • ఆదిలాబాద్‌ బజార్ హత్నూర్ పాఠశాలలో ఘటన
  • ఉపాధ్యాయుడు శంకర్‌ యాదవ్‌ వేరే పాఠశాలకు బదిలీ
  • కన్నీళ్లు ఆపుకోలేకపోయిన విద్యార్థులు 

'ప్లీజ్‌ సర్‌.. వెళ్లొద్దు.. ఇక్కడే ఉండండి ప్లీజ్‌' అంటూ విద్యార్థులు తమ ఉపాధ్యాయుడిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలం ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్‌ యాదవ్‌ వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. 
  
ఆయనంటే పాఠశాల విద్యార్థులకు చాలా ఇష్టం. అంతగా వారిలో కలిసి పోయారు. ఆయన బదిలీ అయి వెళ్లిపోతున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.  రేపటి నుంచి పాఠశాలకు రారన్న విషయాన్ని వారు ఓర్చుకోలేకపోయారు.  ఆయనను చుట్టుముట్టి వెళ్లొద్దని వేడుకున్నారు.                   

  • Loading...

More Telugu News