Budda Venkanna: కరోనాకి మందు కనిపెట్టడం పక్కన పెట్టి జగన్‌కి వచ్చిన జబ్బుకి మందు కనిపెట్టే పనిలో ఉన్నారు: బుద్ధా వెంకన్న

budda venkanna criticises jagan

  • జగన్‌కి  బుద్ధా వెంకన్న చురకలు
  • తండ్రిని చంపిన వాడు అని ఆరోపించిన వ్యక్తిని పిలిచి సన్మానం చేశారు
  • ఆ జబ్బు ఏంటో, దాని లక్షణాలు, మందుపై రీసెర్చ్ జరుగుతోంది

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కి టీడీపీ నేత బుద్ధా వెంకన్న చురకలంటించారు. 'కరోనా వైరస్ కి మందు కనిపెట్టడం పక్కన పెట్టి జగన్‌ గారికి వచ్చిన జబ్బు కి మందు కనిపెట్టే పనిలో ఉన్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు' అని ట్వీట్‌ చేశారు.
 
'తండ్రిని చంపిన వాడు అని ఆరోపించిన వ్యక్తిని పిలిచి సన్మానం చేసే జబ్బు ఏంటో, దాని లక్షణాలు, మందు పై రీసెర్చ్ జరుగుతోంది' అని అన్నారు.
 
'ఆ రోజు ఇచ్చిన పిలుపుకి రెచ్చిపోయి రాళ్లేసిన వాళ్లు ఇంకా జైలు చుట్టూ తిరుగుతున్నారు. జగ్గూ మాత్రం తండ్రి పోతేపోయాడు, బడుగు బలహీన వర్గాలు బలైపోతే మనకేంటి అంటూ సన్మానాల్లో మునిగి తేలుతున్నారు' అని చెప్పారు.

  • Loading...

More Telugu News