Donald Trump: ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి కోవింద్‌ విందు.. ఘనస్వాగతం.. ప్రముఖుల హాజరు!

trump visits rashtrapati bhavan

  • ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ విందు 
  • హాజరైన పలు రాష్ట్రాల సీఎంలు 
  • రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరిగి వెళ్లనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ విందు ఇస్తున్నారు. ట్రంప్‌ దంపతులకు కోవింద్‌ దంపతులు స్వాగతం పలికారు. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అసోం, హర్యానా, కర్ణాటక, బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల సీఎంలు కూడా హాజరవుతున్నారు.          
ట్రంప్‌ దంపతులకు కోవింద్‌ పలు అంశాలను వివరించి చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగుతోన్న ఈ విందు కార్యక్రమం ముగిశాక ఈ రోజు రాత్రి దాదాపు 10 గంటలకు ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు.      
విందులో దాల్‌ రైసీనా, మటన్‌ బిర్యానీ, ర్యాన్‌, మష్రూమ్‌ డిష్‌, హాజల్‌నట్‌ ఆపిల్‌, వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్‌ రాబ్డీతో పాటు నోరూరించే ఎన్నో వంటకాలను సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News