Chandrababu: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు... పరిస్థితి ఉద్రిక్తం

YSRCP members protests Chandrababu visit in Kuppam

  • చంద్రబాబు కుప్పం పర్యటన
  • నియోజకవర్గానికి బాబు చేసిందేమీ లేదని వైసీపీ కార్యకర్తల ఆగ్రహం
  • టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట
  • భారీగా మోహరించిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లారు. అయితే ఆయనకు కుప్పంలో వ్యతిరేకత ఎదురైంది. వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు భారీగా మోహరించారు.

  • Loading...

More Telugu News