Amaravati: అవసరమైతే అమరావతి విషయంలో రైతులతో కలిసి పోరాడుతాం: సీపీఐ సీనియర్‌ నేత రాజా

our stand clear on amaravathi says cpi raja

  • రైతు జేఏసీ నేతలు కలిసిన సందర్భంగా వ్యాఖ్య
  • అమరావతి విషయంలో మాది ఒకటే స్టాండ్‌
  • మూడు రాజధానులకు మేము వ్యతిరేకం

అమరావతి రాజధాని విషయంలో సీపీఐది మొదటి నుంచి ఒకటే నిర్ణయమని, ఈ విషయంలో మార్పు ఉండదని సీపీఐ సీనియర్‌ నేత రాజా స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారోగాని, వారు తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి జేఏసీ రైతులు ఈరోజు ఢిల్లీలో రాజాను కలిశారు. వారి వెంట పార్టీ నాయకుడు రామకృష్ణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని, అవసరమైతే ఈ విషయంలో రైతులతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడాన్ని రాజా తప్పుపట్టారు.

  • Loading...

More Telugu News