BJP: విజయవాడలో బీజేపీ నేతల సమావేశం

 BJP leaders meeting in Vijayawada

  • స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం 
  • హాజరైన కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి
  • క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం

విజయవాడలో బీజేపీ నేతల సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, బాపట్ల, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మహిళా నేత పురందేశ్వరి తదితర నేతలు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జనసేన పార్టీతో పొత్తు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.

  • Loading...

More Telugu News