Bihar: మద్యం లేని భారతావనిని నిర్మించాలి: నితీశ్ కుమార్

Liquor ban should be implemented in entire country says Nitish Kumar

  • మనుషుల జీవితాలను మద్యం చిదిమేస్తోంది
  • దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధం గాంధీ ఆశయం
  • బీహార్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

మద్య నిషేధంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషుల జీవితాలను మద్యం చిదిమేస్తోందని, మద్యం లేని భారతావనిని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి.. దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధం విధించాలన్నది మహాత్మాగాంధీ ఆశయమన్నారు. గతంలో దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేసినా ఆ తర్వాత దానిని ఎత్తివేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 2011 నుంచి బీహార్‌లో మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తూ 2016 నాటికి పూర్తిగా నిషేధించామని నితీశ్ కుమార్ వివరించారు.

  • Loading...

More Telugu News