Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి?

Vijayasai Reddy may gets berth in union cabinet

  • ఎన్టీయేలోకి వైసీపీ చేరబోతోందనే ప్రచారం
  • వైసీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం?
  • విజయసాయికి నౌకాయానశాఖను అప్పగిస్తారని ప్రచారం

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్డీయేలోకి వైసీపీ చేరబోతోందని, ఈ విషయంపై మోదీతో చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. వైసీపీకి రెండు లేదా మూడు మంత్రి పదవులు దక్కబోతున్నాయనేదే ఆ వార్త. వైసీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కనున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీలో కీలక నేత అయిన విజయసాయిరెడ్డికి నౌకాయానశాఖను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అనురాధకు కేంద్ర సహాయ మంత్రి ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది.

Vijayasai Reddy
YSRCP
Union Minister
NDA
  • Loading...

More Telugu News