Crime News: గుంటూరు జిల్లాలో ఆటో- లారీ ఢీ.. నలుగురి దుర్మరణం

  • పలువురికి తీవ్రగాయాలు
  • ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఘోరం
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పొలీసులు

ఆటో, లారీ పరస్పరం ఢీకొట్టుకున్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవ్వగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న లారీ పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News