Dil Raju: కాలి నడకన తిరుమల చేరుకున్న సమంత, దిల్ రాజు!

  • ఇటీవల విడుదలైన 'జానూ'
  • స్వామివారి ఆశీస్సుల కోసమే వచ్చాం
  • పవన్ చిత్రం ఫస్ట్ లుక్ మార్చిలో
  • దర్శనం అనంతరం మీడియాతో దిల్ రాజు

ఇటీవల వెండి తెరను తాకిన 'జానూ' చిత్రం మంచి టాక్ ను తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోగా, చిత్ర బృందం తిరుమలకు వచ్చి, నేటి ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామిని దర్శించుకుంది. నిర్మాత దిల్ రాజు, సమంత తదితరులు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ, తిరుమలకు చేరుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో హీరో శర్వానంద్ కూడా ఉన్నారు.

సినిమా హిట్ కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు దర్శనం అనంతరం దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. సినిమాలో శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ ను మార్చిలో విడుదల చేస్తామని, మేలో వేసవి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు.

Dil Raju
Tirumala
Samanta
Sharvanand
Jaanu
  • Loading...

More Telugu News