Nara Lokesh: ఈ మంత్రులను ఏం చెయ్యాలి? ఏయే కేసులు పెట్టాలి?: నారా లోకేశ్ ప్రశ్న

  • టీడీపీ కార్యకర్తపై పోలీసుల చర్యకు మండిపడ్డ లోకేశ్
  • ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో తప్పుబట్టినందుకే రౌడీషీటా?
  • శాసనసభ సాక్షిగా రౌడీల్లా వ్యవహరిస్తున్నవారినేం చేయాలి?

సత్తెనపల్లి పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్‌పై రౌడీషీట్‌ నమోదుకు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయ రామారావు ఆదేశాలు ఇచ్చారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.

'ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో తప్పుబట్టినందుకే రౌడీ షీట్ ఓపెన్ చేసే దుస్థితికి జగన్ గారు దిగజారిపోయారు. మరి శాసనసభ సాక్షిగా రౌడీల్లా వ్యవహరిస్తున్న వైకాపా నాయకులు, మంత్రులను ఏం చెయ్యాలి, ఏయే కేసులు పెట్టాలి?' అని నిలదీశారు.

  • Loading...

More Telugu News