chaina: కరోనా కల్లోలం... ఆగని మరణ మృదంగం!

  • చైనాలో 304కు చేరిన మృతుల సంఖ్య 
  • మరో ఇరవై వేల మంది వరకు బాధితులు 
  • వీరిలో 315 మంది పరిస్థితి విషమం

అగ్రరాజ్యం అమెరికాను ఎదిరించేందుకు కూడా భయపడని అసియా దిగ్గజం చైనా ప్రస్తుతం దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను చూసి మాత్రం వణికిపోతోంది. బాధితుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు కరోనా బారినపడి చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 304 కాగా, మరో 315 మంది పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 14,380 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. మరో 4,562 మంది అనుమానితులు ఉన్నారు.

328 మంది వైరస్ బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో బాధితుల సంఖ్య 20 వేలకు చేరింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా తాకింది. ప్రస్తుతం ఆ దేశంలో ఎనిమిది మంది బాధితులు ఉన్నట్లు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలకు ఈ వ్యాధి విస్తరించింది. 130 కేసులు నిర్ధారణ అయ్యాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News