Amaravati: 'రాజధాని' పోరులో ఆగిన మరో రైతు గుండె

  • రాయపూడికి చెందిన తోట రాంబాబు (36) మృతి
  • రాజధానికి ఎకరన్నర పొలాన్నిచ్చిన రైతు
  • న్యాయం జరగట్లేదని మనస్తాపం

అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనలు 44వ రోజుకు చేరాయి. ఈ పోరులో మరో గుండె ఆగింది. రాయపూడికి చెందిన తోట రాంబాబు (36) అనే రైతు రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు.  గత కొన్ని రోజులుగా రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొన్న రాంబాబు... ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదని మనస్తాపం చెందాడని, ఈ నేపథ్యంలో గుండెపోటుకు గురైన ఆయన మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తోన్న దీక్షలకు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు మందడంలో ఏర్పాటు చేసిన 24 గంటల నిరాహార దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News