Hyderabad: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. దీపికా రెడ్డి అనే యువతి మృతి

  • యూసఫ్‌గూడలో ప్రమాదం
  • జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో పనిచేస్తోన్న దీపిక
  • యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరగా ప్రమాదం 

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోన్న సాయిదీపికా రెడ్డి అనే యువతి తన యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఆ సమయంలో ఆమె స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఢీ కొన్న బస్సు కొండాపూర్‌ డిపోకు చెందినదిగా సమాచారం. ఆ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News