Nara Lokesh: ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ వైసీపీ ప్రభుత్వం తీరు.. నారా లోకేశ్ బహిరంగ లేఖ

  • వైసీపీ వాళ్లు ‘పెద్దల సభ’ గౌరవం మంటగలిపారు
  • మంత్రులు గూండాల్లా దాడి చేశారు
  • మండలి చైర్మన్ షరీఫ్ కు రక్షణ ప్రశ్నార్థకమైన పరిస్థితి

నిన్న శాసనమండలిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం..’ అంటూ ప్రారంభించిన ఈ లేఖలో దేవాలయం లాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత గలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నానని అన్నారు. వైసీపీ వాళ్ల చిన్నబుద్ధితో ‘పెద్దల సభ’ అయిన శాసనమండలి గౌరవాన్ని మంటగలిపేశారని, మార్షల్స్ రక్షణగా నిలవకపోతే చైర్మన్ షరీఫ్ కు రక్షణ కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితి అంటూ తన లేఖను కొనసాగించారు.

  • Loading...

More Telugu News