Chennai: ఈ దొంగ వెరైటీ గురూ! కాళ్లకు పట్టీలు ధరించి.. మహిళల లోదుస్తులు చోరీ!

  • పాదరక్షలు, కాస్మొటిక్స్, లోదుస్తులు చోరీ
  • దొంగను పట్టుకునేందుకు సీసీకెమెరా ఏర్పాటు
  • స్థానిక యువకుడే దొంగంటూ పోలీసులకు ఫిర్యాదు

ఇతడో విచిత్రమైన దొంగ. రాత్రివేళ కాళ్లకు పట్టీలు ధరించి మహిళల లోదుస్తులు మాత్రమే దొంగిలిస్తాడు. ఇంటి బయట ఆరేసిన దుస్తులు వరుసగా మాయమవుతుండడంతో అనుమానించిన గ్రామస్థులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చెన్నైలోని కోవై తడియలూరు మీనాక్షి గార్డెన్ ప్రాంతంలో దాదాపు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడి మహిళలు ఉతికి ఆరేసిన దుస్తుల్లోంచి లోదుస్తులు, వారి చెప్పులు మాయమవుతున్నాయి. అలాగే, కారులో ఉండే మహిళల కాస్మొటిక్స్ కూడా మాయం అవుతుండడంతో అనుమానించిన స్థానికులు దొంగను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అందులో రికార్డైన దృశ్యాన్ని చూసి షాకయ్యారు.

స్థానికంగా నివసించే ఓ యువకుడు రాత్రివేళ కాళ్లకు పట్టీలు ధరించి ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. చోరీ చేసిన మహిళల లోదుస్తులను అదే ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద దాస్తున్నట్టు గమనించారు. అంతేకాదు, వాటిలో కొన్నింటికి నిప్పు పెట్టి కాల్చేసినట్టు తెలుసుకున్నారు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితుడు చోరీలకు పాల్పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News