పరామర్శించే హక్కు మాకుంది, ఎవరు ఆపుతారో రండి: నాగబాబు
- రాజధాని గ్రామాల్లో పర్యటించాలనుకుంటున్న జనసేన నేతలు
- భారీగా మోహరించిన పోలీసులు
- రాజధానిపై జనసేనకు స్థిరమైన వైఖరి ఉందన్న నాగబాబు
దీనిపై మెగాబ్రదర్ నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఎర్రబాలెం వరకు వెళ్లి తీరుతామని, ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తామని సవాల్ విసిరారు. రైతులకు సానుభూతి తెలిపే హక్కు తమకుందని, తమను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. రాజధాని అంశంలో జనసేన పార్టీ దృఢవైఖరితో ఉందని, పార్టీ నిర్ణయాన్ని తాము పాటిస్తామని చెప్పారు. ప్రస్తుతం జనసేన కార్యాలయం వద్ద పోలీసులు పవన్ కల్యాణ్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా, పవన్ మాత్రం రాజధానిలో పర్యటించి తీరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.