Andhra Pradesh: ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

  • హైపవర్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • 18న కేబినెట్ భేటీ
  • రాజధానిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం

ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలను చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు సూచించిన అంశాలు, సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకంటే ముందే ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ఈ భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలు, హైపవర్ కమిటీ సిఫారసులు, పాలన వికేంద్రీకరణపై మరోసారి దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Andhra Pradesh
Assembly meet
On 20th January
Cabinet meet on 18th
  • Loading...

More Telugu News