Nara Lokesh: ట్రాఫిక్ ఎలా ఆపుతారంటూ టీడీపీ కార్యకర్తలపై పామర్రు ఎమ్మెల్యే ఆగ్రహం

  • లోకేశ్ అరెస్ట్ తో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం
  • తోట్లవల్లూరు కరకట్టపై ధర్నా
  • నిలిచిన ట్రాఫిక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో తోట్లవల్లూరు కరకట్టపై ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్ ను విడుదల చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు కరకట్టపై ధర్నాకు దిగారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం ప్రదర్శించారు. ట్రాఫిక్ ఎందుకు ఆపుతున్నారంటూ మండిపడ్డారు. అయితే, ధర్నా విరమించేది లేదని టీడీపీ నేత గురుమూర్తి, ఆయన అనుచరులు ధర్నా కొనసాగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేతో వాగ్యుద్ధానికి దిగారు. దాంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య బాహాబాహీ నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Nara Lokesh
Police
Andhra Pradesh
Amaravati
Thotlavalluru
Pamarru
Anil Kumar
YSRCP
  • Loading...

More Telugu News