Abhinandan Vardhaman: అభినందన్ వర్ధమాన్ రాఫెల్ లో వెళ్లుంటే పరిస్థితి మరోలా ఉండేది: బీఎస్ ధనోవా

  • బాంబే ఐఐటీలో ప్రసంగించిన ఐఏఎఫ్ మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్
  • రాఫెల్ పై సుప్రీం తీర్పు పట్ల ప్రశంసలు
  • రాఫెల్ ఒప్పందానికి పదేళ్లు పట్టిందని వెల్లడి

భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతర పరిణామాల్లో భాగంగా నాడు అభినందన్ వర్ధమాన్ రాఫెల్ యుద్ధవిమానంలో వెళ్లుంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. రాఫెల్ యుద్ధవిమానానికి ఉన్న అదనపు సామర్థ్యంతో అభినందన్ పూర్తి సురక్షితంగా తిరిగివచ్చేవాడన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఆ సమయంలో అభినందన్ ఎందుకు రాఫెల్ లో వెళ్లలేదంటే అందుక్కారణం ఆ విమానాల కొనుగోలులో జరిగిన జాప్యమే. ఏ తరహా విమానం కొనాలో నిర్ణయం తీసుకోవడానికే పదేళ్లు పట్టింది. ఆ ఆలస్యమే అనేక పోరాటాల్లో భారత్ పై ప్రభావం చూపించింది" అని వివరించారు. భారత్ లో చొరబడిన పాక్ విమానాలను తరిమికొట్టేందుకు అభినందన్ మిగ్-21 విమానంతో వెళ్లి శత్రువులకు దొరకడం తెలిసిందే. ఇప్పటికైనా భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరడం శుభపరిణామమని, రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందని బీఎస్ ధనోవా పేర్కొన్నారు,

Abhinandan Vardhaman
Rafale
Jet Fighter
IAF
India
Pakistan
Balakot
BS Dhanova
  • Loading...

More Telugu News