Amaravati: రేపు జరగాల్సిన హైపవర్ కమిటీ సమావేశం ఎల్లుండికి వాయిదా

  • కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా
  • జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించనున్న కమిటీ
  • సచివాలయం లేదా సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం

ఏపీ సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలపై చర్చించేందుకు రేపు జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని వాయిదా వేసినట్టు సమాచారం.

హైపవర్ కమిటీ భేటీ సచివాలయం లేదా సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ కమిటీకి కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News