Philippines: ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థి దుర్మరణం

  • ఫిలిప్పీన్స్ లో కృష్ణా జిల్లా యువకుడి దుర్మరణం
  • బైక్ పై వెళుతుండగా ఢీకొన్న బస్సు
  • స్వగ్రామంలో విషాదం

ఫిలిప్పీన్స్ దేశంలో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పొన్నపల్లి జగదీశ్ అనే యువకుడు బైక్ పై వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగదీశ్ ఘటనస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. జగదీశ్ స్వస్థలం కృష్ణా జిల్లా నందిగామ నేతాజీ నగర్. వెటర్నరీ కోర్సు చదివేందుకు జగదీశ్ 2016లో ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ప్రస్తుతం ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. జగదీశ్ మరణవార్తతో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Philippines
Telugu Student
Jagadish
Veternary
Road Accident
Krishna District
  • Loading...

More Telugu News