Prostitution: అమ్మాయిలను రప్పించి వ్యభిచారం... గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు!

  • ముంబై, ఢిల్లీల నుంచి అమ్మాయిలు
  • ఆరుగురు యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించిన పోలీసులు
  • 2016లో అరెస్ట్ అయినా తీరును మార్చుకోని నిందితులు

హైదరాబాద్, రాజేంద్రనగర్ లో సాగుతున్న వ్యభిచారదందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2016లో వ్యభిచార దందాను నిర్వహిస్తూ, మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని జైలుకు పంపగా, బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా, తమ తీరును మార్చుకోలేదు.

తాజాగా, ముంబై, ఢిల్లీల నుంచి అమ్మాయిలను రప్పించి, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని దందాను సాగిస్తుండగా, తమకు లభించిన విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్‌, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఆరుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్ట్ చేసి, వారి నుంచి నాలుగు సెల్‌ ఫోన్లు, రూ. 28 వేల నగదు, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు తరలించినట్టు తెలిపారు.

ఈ ఇంటిని వీరు రెండు వారాల క్రితమే అద్దెకు తీసుకున్నారని ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపారు. ముంబై నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ఒకరు, నగరం నుంచి ఒక యువతిని ఇక్కడకు తీసుకుని వచ్చారని, వారికి నెలకు రూ. 25 వేలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. ఇక్కడి పాతబస్తీకి చెందిన ఇమ్రాన్‌ షరీఫ్‌ (25) విటులను పంపుతుంటాడని చెప్పారు. వీరు ఇంకా ఎక్కడెక్కడ వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారన్న విషయమై విచారిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News