Udhandarayunipalem: ఉద్ధండరాయునిపాలెంలో మీడియా వాహనాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు

  • సచివాలయానికి వెళ్తున్న మీడియా వాహనం
  • కర్రలతో దాడి చేసి, అద్దాలను పగలగొట్టిన రైతులు
  • కారులోని మీడియా ప్రతినిధులకు గాయాలు

అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఉద్ధండరాయునిపాలెంలో సచివాలయానికి వెళ్తున్న ఓ మీడియా వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో ఉన్నవారిపై దాడి చేశారు.

మరోవైపు కారును వెనక్కి మళ్లిస్తున్న తరుణంలో ఓ బైక్ ను కారు ఢీకొంది. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని మీడియా వాహనం అక్కడి నుంచి వెనక్కి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. కొన్ని మీడియా సంస్థలు అమరావతి రైతులకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News