కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే
- ఎన్నికల్లో గెలిపొందామనే కారణంతో ప్రజల మధ్య అంతరాలు పెంచడం సరికాదు
- విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే మరిన్ని ఎన్నికల్లో విజయం సాధించవచ్చు
- మన తర్వాతి తరం మరింత మెరుగైన స్థితిలో ఉండబోతోంది
వారికి ఏమి కావాలో యువ భారతం మనకు చెబుతోందని భోగ్లే తెలిపారు. మనం ఏం చెబుతున్నామో... అది వారికి అవసరం కాకపోవచ్చని చెప్పారు. గత 25 ఏళ్లుగా మనం మంచి జీవితాన్ని అనుభవించామని... యుద్ధాలు, సాంస్కృతిక వ్యత్యాసాల ద్వారా తర్వాతి తరానికి అన్యాయం చేయకూడదని తెలిపారు. మన కంటే మన తర్వాతి తరం మరింత మెరుగైన స్థితిలో ఉండబోతోందని... వారిని అలాగే ఉండనిద్దామని చెప్పారు.