GN Rao Committee: జీఎన్ రావు కమిటీకి ఏ అర్హత ఉందని వారి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవాలి?: సీపీఐ నారాయణ

  • గుంటూరులో సీపీఐ వార్షికోత్సవ సభ
  • హాజరైన నారాయణ
  • ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదని వ్యాఖ్యలు

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ రాజధాని అంశం గురించి సీపీఐ వార్షికోత్సవ సభలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, ఎంతో కష్టపడి సాధించుకున్న రాష్ట్రానికి రాజధాని కూడా ఓ అందమేనని, ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.

గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలని మొదటి నుంచి తాము కోరుతున్నామని అన్నారు. అసలు, రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీకి అర్హత ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. కమిటీకి ఏ అర్హత ఉందని వారి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవాలని నిలదీశారు. జీఎన్ రావు కమిటీ నివేదికను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఉండాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు.

GN Rao Committee
YSRCP
Andhra Pradesh
Amaravathi
CPI
CPI Narayana
Guntur
  • Loading...

More Telugu News