Police: జేసీ వ్యాఖ్యలకు నిరసన: పోలీసు బూట్లను శుభ్రం చేసి, వాటిని ముద్దాడిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. వీడియో ఇదిగో

  • పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
  • పోలీసు బూట్లంటే యుద్ధంలో ఆయుధాలని వ్యాఖ్య
  • పోలీసులను తిట్టినందుకే జేసీ పతనావస్థకు చేరారని విమర్శ

పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు బూట్లను శుభ్రం చేసి, వాటిని ముద్దాడారు. పోలీసు బూట్లంటే యుద్ధంలో ఆయుధాలని, పోలీసులను తిట్టినందుకే జేసీ పతనావస్థకు చేరారని అన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలని గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రజలు, దేశ సమగ్రతను కాపాడే క్రమంలో అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నానని చెప్పారు.  దేశానికి రక్షణ కల్పించే పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యే సత్తా ఉన్నప్పటికీ చాలా మంది పోలీసు వ్యవస్థలో పనిచేయాలన్న నిబద్ధతతో అక్కడే కొనసాగుతున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు. తాను జస్ట్‌ ట్రయిల్‌ చూపించానని, ఎంపీని అయ్యానని, ఈ విషయాన్ని జేసీ గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీని ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు ఎందుకు మందలించలేదని గోరంట్ల మాధవ్ నిలదీశారు. అంతేగాక చంద్రబాబు నవ్వారని అన్నారు. కాగా, పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని జేసీ ఇటీవల వ్యాఖ్యానించారు. వారికి వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

  • Loading...

More Telugu News