Mamata Banerjee: కోల్ కతా హైకోర్టులో మమతా బెనర్జీపై మూడు పిటిషన్లు

  • పిటిషన్లు వేసిన ఇద్దరు అడ్వొకేట్లు, ఒక వ్యాపారవేత్త
  • పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమనడంపై తొలి పిటిషన్
  • ప్రకటనలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ మరో పిటిషన్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్ కతా హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరు అడ్వొకేట్లు, ఒక వ్యాపారవేత్త ఈ పిటిషన్లు వేశారు. పశ్చిమబెంగాల్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని మమత ప్రకటించడంపై తొలి పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదంటూ అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారని, ఈ ప్రకటనలకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ రెండో పిటిషన్ దాఖలైంది. కోల్ కతా మేయర్ ఫరీద్ హకీంను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని కోరుతూ మూడో పిటిషన్ దాఖలైంది.

  • Loading...

More Telugu News