Hyderabad: ‘దిశ’ దారుణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. మతిస్థిమితం లేని యువతిపై ఆటోడ్రైవర్ల అఘాయిత్యం!

  • గత నెల 26న హైదరాబాద్‌లో ఘటన
  • సైగల ద్వారా ఏం జరిగిందో చెప్పిన బాధితురాలు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన దిశ హత్యాచార ఘటనకు సరిగ్గా ఒక రోజు ముందు హైదరాబాద్‌లో జరిగిన దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గత  నెల 26న పాతబస్తీలోని ఓ మానసిక వికలాంగురాలిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు, ఓ బ్యాండ్‌మాన్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులైన ముగ్గురు యువకులు ఖలీమ్, అజీజ్, నజీర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని కుల్సుంపురా పరిధిలో 19 ఏళ్ల మానసిక వికలాంగురాలు తల్లి, సోదరులతో కలిసి ఉంటోంది. మతిస్థిమితం లేని యువతి అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోవడం, సోదరులు వెళ్లి తీసుకురావడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గత నెల 26న ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి పురానాపూల్ చౌరస్తా వద్దకు చేరుకుంది.

అక్కడ ఆమెను చూసిన ఆటో డ్రైవర్లు ఖలీమ్ (28), అతడి బంధువు అబ్దుల్ అజీజ్ (38)లు యువతి వద్దకు వెళ్లి ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. అనంతరం మూసీ నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే రోజు రాత్రి 8:30 గంటలకు బాధితురాలిని జుమ్మెరాత్ బజార్‌లో దింపి, అక్కడే ఉన్న బ్యాండ్‌మాన్ నజీర్ (46)కు అప్పగించి ఆమె అడ్రస్ తెలుసుకుని వారి ఇంట్లో అప్పగించాలని చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లగానే నజీర్ కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అర్ధరాత్రి వేళ ఆమెను పురానాపూల్ చౌరస్తాలో వదిలి వెళ్లిపోయాడు.

సోదరి కనిపించకపోవడంతో అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె సోదరులు.. పురానాపూల్ వద్ద కనిపించిన ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని సైగల ద్వారా వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక నిపుణులు, వైద్యుల సాయంతో ఆమెను మాట్లాడించి చికిత్స అందించారు. ఆమె చెప్పిన దానిని బట్టి అత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News