vijayawada: విజయవాడలో చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన సీఎం జగన్ కుటుంబసభ్యులు

  • శేషసాయి కల్యాణమంటపంలో వస్త్ర ప్రదర్శన 
  • అనేక స్టాళ్లను ఆసక్తిగా తిలకించిన వైఎస్ విజయమ్మ, భారతి
  •  వైఎస్ కుటుంబీకుల రాకతో కిటకిటలాడిన కల్యాణమంటపం

విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సీఎం జగన్ కుటుంబసభ్యులు సందర్శించారు. విజయవాడ శేషసాయి కల్యాణమంటపంలో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ కు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి విచ్చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆభరణాల స్టాళ్లను కూడా తిలకించారు. ఈ సందర్భంగా ఇరువురు కొన్నింటిని కొనుగోలు చేశారు. దాదాపు గంటసేపు ఆ వస్త్రప్రదర్శనలో వారు సందడి చేశారు.

కాగా, విజయమ్మ, భారతి రావడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్వాగతం పలికారు. వైఎస్ కుటుంబీకులు వచ్చారని తెలియడంతో మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విజయమ్మ, భారతి తమను కలిసిన మహిళలతో సాదరంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News