Bengalur: భార్య వేధింపులు భరించలేక తనువు చాలించిన టెక్కీ!

  • ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య
  • దుబారా ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు 
  • పైగా సొంతింటిని బదలాయించాలంటూ పోరు

నిత్యం భార్య నుంచి ఎదురవుతున్న వేధింపులతో ఆ టెక్కీ విసిగిపోయాడు. తాను తనువు చాలిస్తేగాని తన విలువేమిటో ఆమెకు తెలిసిరాదనుకున్నాడేమో. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. శ్రీనాథ్ (39) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు.

పలు బ్యాంకుల్లో అప్పుచేసి ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. కానీ భార్య నిత్యం చేస్తున్న దుబారా ఖర్చులు, వేధింపులు అతనికి మానసిక స్థిమితం లేకుండా చేశాయి. పైగా ఇంటిని తన తండ్రి పేరున మార్చాలంటూ భార్య నుంచి నిత్యం ఒత్తిడి అధికమైంది.

దీంతో ఆవేదన చెంది, ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక ఆధారాల మేరకు భార్య, ఆమె తల్లిదండ్రులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News