Supreme Court: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదు: సుప్రీంకోర్టు

  • శబరిమలకు వెళ్లే మహిళల రక్షణపై దాఖలైన పిటిషన్లు
  • సుప్రీంకోర్టులో విచారణ
  • రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేం

శబరిమలకు వెళ్లే మహిళల రక్షణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. శబరిమల అంశంపై వచ్చిన రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని తెలిపింది.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా సరే వెళ్లి పూజల్లో పాల్గొనవచ్చని  2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు  తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. అయితే, దీనిపై రివ్యూ పిటిషన్ లు వచ్చాయి. దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం అంశాన్ని సుప్రీంకోర్టు ఇటీవల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

Supreme Court
sabarimala
Kerala
  • Loading...

More Telugu News