Sensex: నష్టాల నుంచి పుంజుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 173 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 53 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 
  • 15 శాతానికి పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. కాసేపట్లోనే మళ్లీ పుంజుకుని భారీగా పెరిగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 40,413కు చేరింది. నిఫ్టీ 53 పాయింట్లు పుంజుకుని 11,910కి పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.77%), ఓఎన్జీసీ (2.28%), టెక్ మహీంద్రా (1.97%), కొటక్ మహీంద్రా (1.56%), టీసీఎస్ (1.97%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-15.33%), వేదాంత లిమిటెడ్ (-1.63%), హీరో మోటో కార్ప్ (-1.44%), ఎల్ అండ్ టీ (-1.21%), భారతి ఎయిర్ టెల్ (-1.17%).

  • Loading...

More Telugu News