Twitter golder Tweet: ‘2019 గోల్డెన్ ట్వీట్’ గా మోదీ చేసిన నినాదం: ట్విట్టర్ ప్రకటన

  • ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ = విజయీ భారత్’ ట్వీట్
  • ఇప్పటివరకు ఈ ట్వీట్ కు నాలుగు లక్షల ఇరవై వేల లైక్ లు  
  • లక్షా పదిహేడువేలకు పైగా రీట్వీట్ల నమోదు

ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్  దేశంలో అత్యంత విలువైన ట్వీట్ గా ఈ ఏడాది నిలిచింది. ఈ మేరకు ట్విట్టర్ ఒక ప్రకటన చేసింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా మోదీ  ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ (ఇవన్నీ కలిస్తే) = విజయీ భారత్(విజయ భారత్) అంటూ ఇచ్చిన నినాదం సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్లో ప్రజల ఆదరణను చూరగొంది. ఈ ట్వీట్ ను భారత్ ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’ గా ట్విట్టర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ట్వీట్ కు నాలుగు లక్షల ఇరవై వేల లైక్ లు రాగా, లక్షా పదిహేడువేలకు పైగా రీట్వీట్లు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ట్విట్టర్లో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో మూడో స్థానంలో నిలిచారు.

Twitter golder Tweet
Modi slogan given during general election
2019 year golden tweet
  • Loading...

More Telugu News