KCR: కేసీఆర్ మాటలే తూటాలయ్యాయి: మంత్రి పువ్వాడ అజయ్

  • కఠిన శిక్షలు పడాల్సిందే
  • అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదు
  • తాను పోలీసునైవుంటే బాగుండేదన్న అజయ్

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడాల్సిందేనని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన, శంషాబాద్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.

ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకి చూపిస్తామన్న కేసీఆర్ మాటలే తూటాలుగా మారాయని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతిస్తుందని ఆయన అన్నారు. తాను పోలీసును కాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని, తాను పోలీసుగా ఉండి, ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొని ఉండుంటే బాగుండేదని అనిపిస్తోందని అజయ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News