janasena: జనసేన నాయకుడి వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం.. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం

  • సాకే పవన్ పై ఫిర్యాదు చేయనున్న వైసీపీ నేతలు?
  • హింసా రాజకీయాలను ‘జనసేన’ ప్రోత్సహిస్తోందని ఫైర్
  • ఎస్కే యూనివర్శిటీలో వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన

మదనపల్లిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకుడు సాకే పవన్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. హింసా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా జనసేన వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అనంతపురంలో ఎస్కే యూనివర్శిటీలోని వైసీపీ విద్యార్థి విభాగం నేతలు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

  • Loading...

More Telugu News