Women: యువతిపై పగ.. 30 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన దుండగుడు

  • యువతిపై అత్యాచారయత్నం చేసిన యువకుడు
  • జైలుకు వెళ్లి, బెయిల్ పై విడుదల
  • యువతిపై పగను పెంచుకున్న వైనం 

ఓ యువతిపై పగను పెంచుకున్న ఓ యువకుడు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది సెప్టెంబర్ లో 17 ఏళ్ల యువతిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు ఆ కామాంధుడిని జైలుకు పంపించారు.

10 రోజుల క్రితం ఆ యువకుడు బెయిల్ పై విడుదలయ్యాడు. యువతిపై పగను పెంచుకున్న అతను... ఆమెను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. రెండు, మూడు రోజుల పాటు ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. నిన్న ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు... 30 కత్తిపోట్లు పొడిచి పాశవికంగా హత్య చేశాడు.

బాధితురాలి అరుపులు విని అక్కడకు వచ్చిన చుట్టుపక్కలవారు... దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ యువతిని తానే చంపేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.

  • Loading...

More Telugu News