YSRCP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ..పరస్పర దాడులు!

  • ఎల్.ఎన్.పేటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఘటన
  • ఉపాధి హామీ పథకం తనిఖీల నేపథ్యంలో ఘర్షణ
  • పది మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమం

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం భౌతికదాడులకు దిగారు. ఎల్.ఎన్.పేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలు ఈరోజు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. కుర్చీలు విసురుకున్నారు. ఈ దాడిలో పది మంది గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News