Sensex: ఫ్లాట్ గా ముగిసిన నేటి మార్కెట్లు

  • 8 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 7 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 40,802కి పెరిగింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 12,048కి దిగింది. టెలికాం, ఎనర్జీ, మెటల్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.28%), ఏసియన్ పెయింట్స్ (1.94%), కొటక్ మహీంద్ర బ్యాంక్ (1.15%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.79%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-6.22%), బజాజ్ ఫైనాన్స్ (-3.04%), ఓఎన్జీసీ (-2.73%), సన్ ఫార్మా (-2.17%), మారుతి సుజుకి (-1.77%).

  • Loading...

More Telugu News