Crime News: దిశ హత్యాచార ఘటనను పార్లమెంటులో ప్రస్తావించనున్న కాంగ్రెస్ ఎంపీలు

  • లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీ రేవంత్ రెడ్డి 
  • చర్లపల్లి జైలులో నిందితులు
  • నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్

దిశ హత్యాచార ఘటనను ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ కేసులో నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు.

దిశ హత్య ఘటన నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో షాద్ నగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు లేదా రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోనుంది. నిందితుల తరఫున వాదించవద్దని బార్ అసోసియేషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News