West Bengal: ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఎంసీ... బీజేపీ పని అయిపోయిందన్న మమతా బెనర్జీ

  • మూడు స్థానాల్లోనూ గెలిచిన టీఎంసీ
  • రెండు స్థానాల్లో మూడు దశాబ్దాల తర్వాత గెలుపు
  • బీజేపీని ప్రజలు తిరస్కరించారన్న దీదీ

పశ్చిమబెంగాల్ లో 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఘన విజయం సాధించింది. ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల గత 30 ఏళ్లలో టీఎంసీ ఒక్కసారి కూడా గెలవలేదు. మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్ పూర్, కలియాగంజ్ స్థానాల్లో టీఎంసీ విజయపతాకం ఎగురవేసింది. ఈ ఘన విజయాలతో, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజకీయ అహంకారానికి బెంగాల్ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని చెప్పారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

  • Loading...

More Telugu News