Vijay Sai Reddy: మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండిస్తున్నాడు: లోకేశ్ పై విజయసాయి రెడ్డి సెటైర్

  • తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తాడు
  • ఈ మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు
  • గతంలో జయంతికి, వర్ధంతికి భేదం తెలియకుండా మాట్లాడాడు

టీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 'తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తిన మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు. గతంలో జయంతికి వర్ధంతికి భేదం తెలియకుండా మాట్లాడి అభాసుపాలయ్యాడు. మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నాడు' అని ట్వీట్ చేశారు.

బీజేపీ చంక ఎక్కడానికి టీడీపీ మళ్లీ ప్రయత్నిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఐదారుగురైనా మిగిలేది అనుమానమేనని అన్నారు. నారా లోకేశ్ రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండక పోవచ్చని ఎద్దేవా చేశారు. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారని విమర్శించారు.

'ఐదు నెలల్లోనే ఎన్ని అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేయాలో అన్నీ చేశారు. ఎల్లో మీడియా రేయింబవళ్లు గింజుకుంటున్నా వారి కుయుక్తులను ప్రజలు పసిగట్టేశారు. దోపిడీ పాలన పోయినందుకు సంతోషంగా ఉన్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా తట్టుకుంటారో చంద్రబాబు దొంగల బ్యాచ్' అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News