Amaravathi: అమరావతిలో విడ్డూరం... పేకాడుతూ పోలీసులకు పట్టుబడిన మహిళలు

  • ఒకే ఇంట్లో పట్టుబడిన ఎనిమిది మంది మహిళలు
  • విస్మయానికి గురైన పోలీసులు
  • రూ.1.36 లక్షలు స్వాధీనం

ఏపీ రాజధాని అమరావతిలో ఆశ్చర్యం కలిగించే ఘటన చోటుచేసుకుంది. కొందరు మహిళలు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. తాడేపల్లి పట్టాభి సీతారామయ్య కాలనీలో ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు విస్తుపోయారు. అక్కడ పేకాడుతున్నవారంతే మహిళలే కావడంతో విస్మయానికి గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ పేకాడుతూ దొరికినవారే కావడం గమనార్హం. కాగా, తాజాగా పట్టుబడిన వారి నుంచి రూ.1.36 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News