Ajit Pawar: అజిత్ పవార్ తాజా ట్వీట్ తో అంతా అయోమయం!

  • మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం
  • ఎన్సీపీ నుంచి చీలిక తెచ్చి బీజేపీకి మద్దతిచ్చిన అజిత్ పవార్
  • తానిప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానంటూ ట్వీట్

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కారకుడైన అజిత్ పవార్ తాజాగా చేసిన ట్వీట్ అయోమయం సృష్టిస్తోంది. తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎల్లప్పటికీ తమ నాయకుడు శరద్ పవారేనంటూ అజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేకాదు, మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లపాటు తమ బీజేపీ-ఎన్సీపీ కూటమి ప్రజారంజక పాలన సాగిస్తుంటూ పేర్కొన్నారు. అంతకుముందు, శరద్ పవార్ వ్యాఖ్యానిస్తూ అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతమని, ఆయన నిర్ణయంతో పార్టీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అజిత్ నిర్ణయాన్ని ఎన్సీపీ స్వాగతించడంలేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తాజా ట్వీట్ పై ఇతర రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Ajit Pawar
Maharashtra
BJP
NCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News