Vijay Sai Reddy: ఆ విషయాలను మర్చిపోతే ఎలా ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ?: బుద్ధా వెంకన్న

  • మీ ఫినాయిల్ పత్రిక తెలుగుని చంపేస్తారా? అని రాతలు రాసింది
  • అన్నీ మీ డైరెక్షన్ లొనే నడిచాయి కదా?
  • జగన్ గతంలో తెలుగు కోసం ఉద్యమం చేశారు
  • ఇప్పుడు నాలుక మడతేసి ఇంగ్లిష్ ఉద్యమం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు, కూతలు అన్నీ మీ డైరెక్షన్ లొనే నడిచాయి కదా మర్చిపోతే ఎలా ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ' అని ఆయన ట్వీట్ చేశారు.

'ఎందుకింత తెగులు? తెలుగు లెస్సేనా? అంటూ గతంలో తెలుగు కోసం ఉద్యమం చేసి, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ గారు నాలుక మడతేసి ఇంగ్లిష్ ఉద్యమం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయారా?' అని బుద్ధా వెంకన్న నిలదీశారు.

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించిన 'మన నుడి, మన నది'.. సినిమా టైటిల్లాగా అదిరిపోయిందని, ముందు తన నలుగురు పిల్లలను పవన్ తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలని విజయసాయి రెడ్డి ఈ రోజు విమర్శించిన విషయం తెలిసిందే. 

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
budda venkanna
  • Loading...

More Telugu News