సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారు: బీజేపీ నేత వివేక్
- మంచిర్యాలలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న నేత
- ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నియంతలా వ్యవహరిస్తున్నారు
- భవిష్యత్తులో సింగరేణిపై అదే రీతిలో వ్యవహరిస్తారేమో..
డబుల్ బెడ్ రూంలు కట్టిస్తానని హామీ ఇచ్చి వాటి నిర్మాణాలు పూర్తిచేయకుండా, వంద ఏళ్ల నుంచి కొనసాగుతున్న సెక్రటేరియట్ భవనాన్ని కూల్చివేస్తానని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ నియంతను తలపిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులపై ప్రతాపం చూపిస్తున్న కేసీఆర్ భవిష్యత్తులో సింగరేణిపై అదేరీతిలో వ్యవహరిస్తాడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు.