Jagan: సీఎం జగన్ ను కలవడంపై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

  • ఇవాళ జగన్ తో భేటీ అయిన బీజేపీ నేత
  • సీఎం ఫండ్ కోసం కలిశానని వెల్లడి
  • రాజధాని కమిటీకి సూచనలు చేశానన్న సోము

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఈ భేటీ రాజకీయంగా విపరీతమైన ఆసక్తి కలిగించింది. దీనిపై సోము వీర్రాజు స్వయంగా వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సీఎం జగన్ ను కలిశానని వెల్లడించారు. అంతేకాకుండా, రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు కూడా అందించానని, ఆ సలహాలను సీఎం జగన్ కు కూడా తెలిపానని పేర్కొన్నారు. దాంతో పాటే ఇంగ్లీష్ మీడియం అంశంపైనా సీఎంతో మాట్లాడానని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని అన్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఇంగ్లీషు ఎంతో అవసరమని వీర్రాజు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News