Maharashtra: ఈ నెల 9తో ముగియనున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం.. రాష్ట్రపతి పాలన?

  • కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి  ఈ నెల 10 వరకే గడువు
  • ఢిల్లీకి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 
  • సోనియా గాంధీతో  భేటీ కానున్న శరద్ పవార్  

మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 9తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ నెల 10లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. లేదంటే ఆ రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీకి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ .. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించేలా నిధులు ఇవ్వాలని కోరడానికే అమిత్ షాను కలిసినట్లు బీజేపీ నేతలు అంటున్నారు  

 మరోవైపు, ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ భీటీ కానున్నారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని 50-50 ఫార్ములా ప్రకారం పంచుకోవాలంటూ బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News