Maharashtra: కమలంపై బాణం గురి.. కార్టూన్ పోస్ట్ చేసిన ఎన్సీపీ నేత

  • ఇటీవల  పులి చేతిలో కమలం కార్టూన్ వైరల్
  • తాజాగా మరో కార్టూన్
  • మహారాష్ట్రలో కొనసాగుతోన్న ఉత్కంఠ

మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వ ఏర్పాటుపై జాప్యం కొనసాగుతోంది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్ పులి చేతిలో కమలం (బీజేపీ ఎన్నికల గుర్తు) ఉన్నట్లు ఓ కార్టూన్ ను పోస్ట్ చేసి... రిమోట్ కంట్రోల్ తమ చేతిలో ఉందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజాగా, ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో ఓ కార్టూన్ ను పోస్ట్ చేసి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలంపై శివసేన బాణం గుర్తు ఎక్కుపెట్టినట్లు ఉన్న కార్టూన్‌ వేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీజేపీని శివసేన గురి చూసి కొడుతుందనేలా ఈ కార్టూన్ ఉంది.

కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో బీజేపీకి శివసేన మద్దతు తప్పనిసరి అయింది. దీంతో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. అయితే, బీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవట్లేదు.

  • Loading...

More Telugu News